భారత రత్న డా . బి.
ఆర్ . అంబేడ్కర్ 126 వ జయంతిని పురస్కరించుకొని ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం
10 ఏప్రిల్ 2017 సాయంత్రం 5 గంటలకు ‘ ఫెయిత్ హోమ్ ‘ లో సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ,
ఆంథ్రోపాలజీ శాఖాధ్యక్షులు, దళిత మేధావి ఆచార్య పి .డి.సత్యపాల్ ముఖ్య అతిథిగా,
వక్తగా విచ్చేశారు . లక్షిం పేట నరమేధంపై
స్పందిస్తూ ‘నెత్తుటి మరకలు ‘ అనే దీర్ఘకవితా సంపుటిని రచించిన దళిత కవి శ్రీ
నేలపూరి రత్నాజీ ని కూడా మరో అతిథిగా ఆహ్వానించడం జరిగినది . దళితులపట్ల
జరుగుతున్న దాడులను నిరసిస్తూ ... ప్రత్యేకించి లక్షిం పేట సంఘటనపై అద్భుతంగా తన
వాణిని వినిపించిన కవి నేలపూరి రత్నాజీ ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో
‘’ దళిత దళం సాహితీ పురస్కారాన్ని ‘
రత్నాజీ కి ప్రదానం చెయ్యడమైనది.
దళితుల సమస్యలూ –
పరిష్కార మార్గాలు ‘ అనే అంశంపై ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య
పి.డి.సత్యపాల్ కుల వ్యవస్థ గూర్చి ...ఏవిధంగా దళితులను అణిచి వేశారు , దళితుల
హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి... మొదలగున్న అనేక విషయాలను ఆద్యంతం ఆసక్తికరంగా
సభను రంజింప జేస్తూ ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో
స్థానిక దళిత నాయకులు కొండబాబు మాష్టారు, మంగరాజు , చంద్రశేఖర్ , తదితరులే గాక ఏ .
ఎం . ఏ. ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం. కొండల
రావు , పేరం వెంకట సుధాకర్ , కె వి .ఎస్. మహేశ్వర రావు , తుమ్మపూడి నిరంజన్ కుమార్
, శ్రీమతి ఎన్ శ్యామల , శ్రీమతి జె .సామ్రాజ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .
అనంతరం డా . తలతోటి పృథ్వి రాజ్ ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని స్వీకరించి సభను
విజయవంతం చెయ్యడమైనది . ~ ఏ ఎం. ఏ .ఎల్ .
దళిత అధ్యాపక బృందం