శీతాకాలాన్ని
దృష్టిలో పెట్టుకొని దళిత పేదలను చలినుంచి దళిత వృద్ధులను సంరక్షించాలనే
సదుద్దేశంతో 12 డిసెంబర్ 2016న ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి
పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం .
కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం
దుప్పట్ల పంపిణీ కార్యక్రంమాన్ని చేపట్టారు. అనకాపల్లి లోని ఉమ్మలాడ పంచాయితీ లోని
ఎస్సీ కోలని లో పేద దళితులకు దుప్పట్ల పంపిణి చెప్పట్టారు. తొలుత కోలని లోని
అంబేద్కర్ విగ్రహానికి డా . తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ బృందం పూలమాలవేసి
నివాళి అర్పించి , జై భీమ్ నినాదాలు చేసి స్థానిక మాల మహానాడు జిల్లా నాయకులు శ్రీ కంకణాల
శ్రీనివాసరావు ఆధ్యక్షతన ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. అనకాపల్లి దళిత నాయకులు
పావాడ కామరాజు , మంగరాజు, గ్యాస్ అప్పారావు మొదలగు వారి చేతుల మీదుగా దుప్పట్లను
పంచడం జరిగినది.
No comments:
Post a Comment