*ఆత్మవిశ్వాసమే ఆయుధం*
జేఈఈ మెయిన్స్లో 360కి 360 మార్కులు సాధించిన కల్పిత్
జేఈఈ మెయిన్స్లో 360/360 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన కల్పిత్ వీర్వాల్ దళితబిడ్డ. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వారి స్వస్థలం. తండ్రి ప్రభుత్వాసుపత్రిలో కాంపౌండర్ కాగా.. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కల్పిత్ సాధారణ టీనేజ్ కుర్రాళ్లకు భిన్నం. ఎప్పుడు చూసినా తోటి పిల్లలు స్మార్ట్ఫోన్తో సోషల్ మీడియాలో బిజీగా ఉంటే... కల్పిత్ మాత్రం చదువుపై దృష్టి సారించేవాడు. సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా సందేహం వచ్చినపుడు మాత్రమే స్మార్ట్ఫోన్ ద్వారా ఇంటర్నెట్లో సమాధానం వెతికేవాడు. పాఠశాలలోనూ అతని హాజరు దాదాపు 100 శాతం ఉండేది.
సీబీఎస్ఈ చైర్మన్ ఆర్.కే.చతుర్వేది గురువారం ఉదయం స్వయంగా కల్పిత్కు ఫోన్చేసి టాపర్గా నిలిచిన (360/360 సాధించిన) విషయాన్ని తెలపడం గమనార్హం. ‘‘పాఠశాలకు రెగ్యులర్గా వెళ్లేవాడిని, ఏనాడూ క్లాసులు మిస్సయింది లేదు. సందేహాలు వస్తే టీచర్లను అడిగి తీర్చుకునేవాడిని. కాలేజీలో తరగతులు, కోచింగ్ క్లాసులు కాకుండా రోజుకు ఐదారు గంటలు చదివేవాడినని. ఫలితమే ఈ టాప్ ర్యాంకు. టాపర్గా నిలవడం సంతోషమే. అయితే నేను దీన్ని సాధారణ విషయంగానే తీసుకుంటున్నాను. అడ్వాన్స్డ్పై దృష్టి పెట్టాను..’’అని 17 ఏళ్ల కల్పిత్ పేర్కొన్నాడు. కెరీర్ గురించి ఇంకా నిర్ణయాలు తీసుకోకున్నా.. ముంబై ఐఐటీలో కంప్యూటర్ కోర్సు చదవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
చరిత్ర సృష్టించాడు: జేఈఈ మెయిన్స్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ 360/360 (నూటికి నూరుశాతం) మార్కులు సాధించలేదు. మెయిన్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులుంటాయి. అంటే ఏదైనా ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే.. ఒక మార్కు కోత పడుతుంది. ఈ లెక్కన కల్పిత్ 360 మార్కులు సాధించాడంటే మొత్తం అన్ని ప్రశ్నలకూ కచ్చితంగా సరైన సమాధానాలు రాశాడన్నమాట.
ఇదీ నేపథ్యం..: కల్పిత్ తండ్రి పుష్కర్లాల్ వీర్వాల్ ఉదయ్పూర్లోని మహారాణా భూపాల్ ? దిశగా యువతను ప్రోత్సహించేందుకు నిర్వహించే ‘కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)’లో టాపర్గా నిలిచాడు.
2015 సివిల్ సర్వీస్ టాపర్ టీనా దబి( దళిత బిడ్డ )
సివిల్ సర్వీసెస్-2015 పరీక్షలో ఢిల్లీకి చెందిన టీనా దబి అనే యువతి టాప్ ర్యాంకును కైవసం చేసుకుని చాటుకుంది. మంగళవారం ప్రకటించిన ఈ ఫలితాల్లో జమ్మూ-కాశ్మీరుకు చెందిన రైల్వే అధికారి అథర్ అమీర్ యుఐ.షరీఫ్ ఖాన్ రెండో ర్యాంకును సాధించగా, ఢిల్లీకి చెందిన జస్మీత్ సింగ్ సంధు అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి మూడో ర్యాంకును దక్కించుకున్నాడు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన టీనా దబి (22) తొలి ప్రయత్నంలోనే ఈ పరీక్షలో అత్యున్నత ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. ఈ విజయం తనకు ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొంది. కాగా, కాశ్మీరు దక్షిణ ప్రాంతంలోని అనంత్నాగ్కు చెందిన అథర్ (23)కు సివిల్స్లో రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకు లభించింది. 2014లో తొలిసారి ఈ పరీక్ష రాసి ఐఆర్టిఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో ఉద్యోగం పొందిన అతను ప్రస్తుతం లక్నోలోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం సివిల్స్ పరీక్షలో రెండో ర్యాంకు లభించడంతో తన స్వప్నం సాకారమైందని, ప్రజల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అథర్ చెప్పాడు. సివిల్ సర్వీసులో జమ్మూ-కాశ్మీరు క్యాడర్ను ఎంచుకున్నానని, అక్కడ పనిచేసే అవకాశం లభిస్తే ఎంతో సంతోషిస్తానని, సొంత రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నానని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నాడు. ఇదిలావుంటే, మూడో ర్యాంకు సాధించడంలో తనకు చేయూత నిచ్చిన తల్లిదండ్రులు, అధ్యాపకులకు జస్మీత్ సింగ్ సంధు కృతజ్ఞతలు తెలిపాడు. జస్మీత్ తండ్రి న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఇకార్)లో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు తనకు కోచింగ్ ఇచ్చిన అధ్యాపకుడు ముకుల్ పాథక్ ప్రోద్బలం వల్లనే సివిల్స్ పరీక్షలో మూడో ర్యాంకు సాధించగలిగానని తెలిపాడు. chitram సివిల్స్ -2015 పరీక్షల్లో జాతీయ స్థాయ ప్రథమ ర్యాంకు సాధించిన ఢిల్లీ యువతి టినా దబిని ముద్దాడుతున్న తల్లి
Raju and Brijesh Saroj
We speak to Raju and Brijesh Saroj who are children of a daily wage earner in Pratapgarh district of Uttar Pradesh, who, beating all odds have cracked the IITJEE. They are among the top 500 scorers in the competitive exam. The two boys hailing from a Dalit household allegedly had stones pelted at their house allegedly by people of upper castes, simply because they cracked the prestigious exam
DALIT BOY SUNNY PAWAR ON RED CARPET IN OSCAR
Special interview with a young dalit entrepreneur E. Sarath Babu
His mother sold Idlis, he began his entrepreneurial stint as a vendor for tea and coffee, and now owns a prime food chain in the country.
Rajesh Saraiya might be a name that is not known to many but for the people of his community, he is their superhero. Rajesh is India's first Dalit billionaire. Born in a middle class family in Dehradun, Rajesh studied aeronautical engineering in Russia. Now based in Ukraine, he runs a multi-national company SteelMont Pvt Ltd that deals in metals.
No comments:
Post a Comment