Dalitha Dalam Dr.B.R.AMBEDKAR JYOTHIRAO PULE BABU JAGJEEVAN RAM DAMODARAM SANJEEVAYYA KANSHIRAM SAVITHRI BHAI PULE Dalitha Dalam Dalitha Dalam Dr.Talathoti Prithvi Raj Tummapudi Niranjan Kumar D.Willium John Victor P.Venkata Sudhakar M.Kondala Rao K.V.S.Maheswara Rao N.Syamala J.Sambrajyam Dalitha Dalam DALIT POETS KUSUMA DHARMANNA GURRAM JASHUVA BOYI BHEEMANNA JALADI RAJA RAO S.T.JNANANANDA KAVI BOYA JANGAYYA SIVA SAGAR MADDURI NAGESH BABU KALEKURI PRASAD PAIDI TERESH BABU DALIT POETS
కులపిచ్చి మాకు నాస్తి! ఆత్మ గౌరవమే మా ఆస్తి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         ఆత్మ గౌరవం మా దళితుల ఆస్తి! కుల వివక్షత లేనివారితోనే మా దోస్తీ ~డా. తలతోటి పృథ్వి రాజ్         నిజాలే... మా ఇజాలు... ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అగ్రవర్ణాలవారని అనకండి! అందరూ సమానమేనని గ్రహించండి!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         తరాల వివక్షకు ప్రతిరూపాలం! భావితరాలా స్వేచ్చా కాముకులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కరిజమంటే సమతా భావం! దళితులకదే జీవం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         దళితులను అణిచి వేయాలనుకోవడమంటే~రాజ్యాంగ సౌధాన్నీ కూల్చివేయాలనుకోవడమే ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         కుల వివక్ష మానుకోండి! సిసలైన మనిషిగా నిరూపించుకోండి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         అంబేడ్కర్ వారసులం! అసమానతలను ప్రశ్నించే యోధులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్         ఉన్నంతలో ఉన్నతంగా జీవించండి! బిడ్డలా ఉన్నత స్థితికి మెట్లువెయ్యండి ~డా. తలతోటి పృథ్వి రాజ్         దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ వారసులం! కుల వివక్షతపై పిడికిళ్ళం!! ~డా.తలతోటి పృథ్వి రాజ్         మనువాదుల గుండెల్లో గునపాలం! దళితజాతి సిగలో గులాబీలం!! ~డా. తలతోటి పృథ్వి రాజ్         ఒక్కో దళితుడు ఒక్కో కిరణమైతే కులవివక్షత చీకట్లు పటాపంచలే ~డా. తలతోటి పృథ్వి రాజ్         అంబేడ్కర్ జీవితపాఠాన్ని చెప్పండి! మన జీవిత నావకు దిక్సూచి అని తెలపండి ~డా. తలతోటి పృథ్వి రాజ్

Tuesday, July 27, 2021

మహిళా ఉద్యోగి... నిజం తెలుసుకో!

అంబేద్కర్ దళితులకు మాత్రమే మేలు చేశాడనే తప్పుడు అభిప్రాయం కలిగించడానికి అనేకమంది మనువాదులు ప్రయత్నిస్తున్నారు. అంబేద్కర్ అందరివాడు కాదనే తప్పుడు అభిప్రాయం కలిగించే కుట్రలు మానుకో కుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆనాడు అంబేద్కర్ గర్భిణీలైన దళిత మహిళా  ఉద్యోగుల ప్రసూతి సెలవుల గూర్చి కాదు; మతం, కులం, జాతి ప్రస్తావన లేకుండా ప్రతి మహిళా ఉద్యోగి ఆరోగ్య భద్రతను అంబేడ్కర్ దృష్టిలో పెట్టుకొని ప్రసూతి సెలవులు ఇప్పించాడు. ఈనాడు ఈ సౌకర్యాన్ని పొందుతున్న మహిళా ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గ్రహించి కృతజ్ఞతా భావంతో ఉంటే చాలు! మనువాదుల కుట్రపూరిత మాటల్లోని మర్మాన్ని గ్రహిస్తే చాలు!
~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్

Facebook Page DALITHADALAM:
www.facebook.com/dalithadalam

Dalith Dalam Blog:
https://dalithadalam.blogspot.com

Dalitha Dalam Youtube URL Subscription Link:
https://www.youtube.com/channel/UCdaNqiD_fkdu6IAxr1wejHg

Friday, April 21, 2017

Dalitha Dalam Literary Award దళిత దళం సాహితీ పురస్కారం

         భారత రత్న డా . బి. ఆర్ . అంబేడ్కర్ 126 వ జయంతిని పురస్కరించుకొని ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం 10 ఏప్రిల్ 2017 సాయంత్రం 5 గంటలకు ‘ ఫెయిత్ హోమ్ ‘ లో  సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.  ఈ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం , ఆంథ్రోపాలజీ శాఖాధ్యక్షులు, దళిత మేధావి ఆచార్య పి .డి.సత్యపాల్ ముఖ్య అతిథిగా, వక్తగా విచ్చేశారు .  లక్షిం పేట నరమేధంపై స్పందిస్తూ ‘నెత్తుటి మరకలు ‘ అనే దీర్ఘకవితా సంపుటిని రచించిన దళిత కవి శ్రీ నేలపూరి రత్నాజీ ని కూడా మరో అతిథిగా ఆహ్వానించడం జరిగినది . దళితులపట్ల జరుగుతున్న దాడులను నిరసిస్తూ ... ప్రత్యేకించి లక్షిం పేట సంఘటనపై అద్భుతంగా తన వాణిని వినిపించిన కవి నేలపూరి రత్నాజీ ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘’ దళిత దళం సాహితీ పురస్కారాన్ని ‘  రత్నాజీ కి ప్రదానం చెయ్యడమైనది.
        దళితుల సమస్యలూ – పరిష్కార మార్గాలు ‘ అనే అంశంపై ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య పి.డి.సత్యపాల్ కుల వ్యవస్థ గూర్చి ...ఏవిధంగా దళితులను అణిచి వేశారు , దళితుల హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి... మొదలగున్న అనేక విషయాలను ఆద్యంతం ఆసక్తికరంగా సభను రంజింప జేస్తూ ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు కొండబాబు మాష్టారు, మంగరాజు , చంద్రశేఖర్ , తదితరులే గాక ఏ . ఎం . ఏ. ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం. కొండల రావు , పేరం వెంకట సుధాకర్ , కె వి .ఎస్. మహేశ్వర రావు , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , శ్రీమతి ఎన్ శ్యామల , శ్రీమతి జె .సామ్రాజ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . అనంతరం డా . తలతోటి పృథ్వి రాజ్ ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని స్వీకరించి సభను విజయవంతం చెయ్యడమైనది .   ~ ఏ ఎం. ఏ .ఎల్ . దళిత అధ్యాపక బృందం












Thursday, April 20, 2017

Dr. B.R.Ambedkar 126th Birth Anniversary Celebrations-A.M.A.L.College Dalith Lecturers-Anakapalli

     భారత రత్న డా . బి . ఆర్ . అంబేద్కర్ 126 వ జయంతి ఉత్సవ  కార్యక్రమం అనకాపల్లి , ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ వద్ద నిర్వహించబడ్డాయి . ఈ  కార్యక్రమంలో  ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వి సుధాకర్ , కే వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల , సామ్రాజ్యం గారి భర్త జానకీరాం, శ్యామల భర్త రమేష్ గార్లు పాల్గొన్నారు . మొదట డా తలతోటి పృథ్వీ రాజ్ – గ్యాస్ అప్పారావు సంయుక్తంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయగా, అనంతరం తుమ్మపూడి నిరంజన్ కుమార్ తదితరులు మరో చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.   జగ్జీవన్ రామ్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డా . జగన్మోహన్ గారు హాజరయ్యారు . ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడింది. చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం లో మేడిశెట్టి నూకరాజు , వై ఎస్ అర్పి నాయకుడు జగన్ , తదితర బిసి నాయకులు , ఎస్సీ నాయకులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు తమవంతు ఆర్ధిక సహాయాన్ని కొంత అందించారు.












Babu Jagjeevan Ram 110th Birth Anniversary by A.M.A.L.College Dalith Lecturerrs, Anakapalli

     బాబూ జగ్జీవన్ రావ్ 110 వ జయంతిని పురస్కరించుకొని  ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడమైనది .తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పృథ్వీ రాజ్ , మంగరాజులు పూలమాలవేసి నివాళి అర్పించారు.  ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి .వెంకట సుధాకర్, జె . జానకీరాం  మరియు స్థానిక దళిత నాయకులు కొండబాబు మాస్టర్ , గ్యాస్ అప్పారావు , రాము మొదలగున్న వారు పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాజీ  తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్ గూర్చి డా . తలతోటి పృథ్వీ రాజ్ ప్రసంగించారు . 





Babu Jagjeevan Ram 110th Birth Anniversary-A.M.A.L.College Dalith Lecturers, Anakapalli

5 ఏప్రిల్ 2017 ఉదయం, బాబూ జగ్జీవన్ రావ్ 110 వ జయంతిని పురస్కరించుకొని  అనకాపల్లి చోడవరం బస్సు స్టాప్ వద్ద  ఎమ్మార్పియస్ నాయకుడు మంగరాజు ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, ఆయన ఆహ్వానం మేరకు  దళిత అధ్యాపకులు పాల్గొనడం జరిగినది .  తొలుత పట్టణ సి ఐ  విద్యాసాగర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించగా , అనంతరం ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు జగ్జీవన్ రామ్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు తమవంతు ఆర్ధిక సహాయాన్ని కొంత అందించారు .













Dr Ambedkar 60th death anniversary-Dalitha Dalam-A.M.A.L.College Dalith Lecturers, Anakapalli

     దళిత దిక్సూచి, దళిత స్ఫూర్తి ప్రదాత డా . బి ఆర్ అంబేద్కర్ 60వ వర్థంతి కార్యక్రమం 6 డిసెంబర్ 2016 న ఏ ఎం ఏ ఎల్ కళాశాల జంక్షన్ లో నిర్వహించ బడినది.  ఈ కార్యక్రమంలో ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి .వెంకట సుధాకర్, జె . జానకీరాం  మరియు స్థానిక దళిత నాయకులు కొండబాబు మాస్టర్ , గ్యాస్ అప్పారావు , రాము మొదలగున్న వారు పాల్గొన్నారు.


Blankets Distribution by A.M.A.L.College Dalith Lecturers, Ummalada,Anakapalli

      శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత పేదలను చలినుంచి దళిత వృద్ధులను సంరక్షించాలనే సదుద్దేశంతో 12 డిసెంబర్ 2016న   ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం దుప్పట్ల పంపిణీ కార్యక్రంమాన్ని చేపట్టారు. అనకాపల్లి లోని ఉమ్మలాడ పంచాయితీ లోని ఎస్సీ కోలని లో పేద దళితులకు దుప్పట్ల పంపిణి చెప్పట్టారు. తొలుత కోలని లోని అంబేద్కర్ విగ్రహానికి డా . తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ బృందం పూలమాలవేసి నివాళి అర్పించి , జై భీమ్ నినాదాలు చేసి   స్థానిక మాల మహానాడు జిల్లా నాయకులు శ్రీ కంకణాల శ్రీనివాసరావు ఆధ్యక్షతన ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. అనకాపల్లి దళిత నాయకులు పావాడ కామరాజు , మంగరాజు, గ్యాస్ అప్పారావు మొదలగు వారి చేతుల మీదుగా దుప్పట్లను పంచడం జరిగినది.







అంబేడ్కర్ చితాబస్మ రథ యాత్ర - దళిత దళం - ఏ.ఏ.ఏ.ఎల్. కళాశాల

     ౩డిసెంబర్ 2016 న రాష్ట వ్యాప్తంగా పర్యటించే అంబేడ్కర్ చితా భస్మం తో కూడిన రథానికి పూడిమడక జంక్షన్ వద్ద ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ . ఎం . కొండలరావు, పి వెంకట సుధాకర్ , కె వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల, జె సామ్రాజ్యం స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు . వీరితో పాటు స్థానిక దళిత నాయకులు కామరాజు , మంగరాజు, కంకణాల శ్రీనివాసరావు మొదలగున్నవారు పాల్గొన్నారు . చిత్తూరునుండి శ్రీకాకుళం వరకు సాగే రథ యాత్రలో దళిత అధ్యాపకులు పాల్గొనడం అదృష్టంగా భావించారు . దళితుల ఆశా జ్యోతి చితా బస్మాన్ని చూడగలిగే అవకాశానికి అధ్యాపకులు సంతోషించారు . అతిథులకు తేనీటి విందును ఏర్పాటు చేసారు.  ఈ రథం వెంట డాక్టా రాష్ట్ర నాయకులు ఏ  వెంకటేశ్వర రావు , ఆంద్ర విశ్వ విద్యాలయం ఆచార్యులు డా . పి . డి సత్య పాల్ , అనేక దళిత నాయకులు పాల్గొన్నారు