భారత రత్న డా . బి
. ఆర్ . అంబేద్కర్ 126 వ జయంతి ఉత్సవ కార్యక్రమం అనకాపల్లి , ఏ ఎం ఏ ఎల్ కళాశాల
జంక్షన్ వద్ద నిర్వహించబడ్డాయి . ఈ కార్యక్రమంలో
ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా
తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ .
ఎం . కొండలరావు, పి వి సుధాకర్ , కే వి ఎస్ మహేశ్వర రావు , శ్యామల , సామ్రాజ్యం
గారి భర్త జానకీరాం, శ్యామల భర్త రమేష్ గార్లు పాల్గొన్నారు . మొదట డా తలతోటి
పృథ్వీ రాజ్ – గ్యాస్ అప్పారావు సంయుక్తంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయగా,
అనంతరం తుమ్మపూడి నిరంజన్ కుమార్ తదితరులు మరో చిత్రపటానికి పూలమాలవేసి నివాళి
అర్పించారు. జగ్జీవన్ రామ్ కి నివాళి అర్పించారు. ఈ
కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి ప్రభుత్వ
ఆసుపత్రి సూపరిండెంట్ డా . జగన్మోహన్ గారు హాజరయ్యారు . ఈ సందర్భంగా పెద్ద ఎత్తున
అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడింది. చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం లో
మేడిశెట్టి నూకరాజు , వై ఎస్ అర్పి నాయకుడు జగన్ , తదితర బిసి నాయకులు , ఎస్సీ
నాయకులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు
తమవంతు ఆర్ధిక సహాయాన్ని కొంత అందించారు.
No comments:
Post a Comment