5 ఏప్రిల్ 2017
ఉదయం, బాబూ జగ్జీవన్ రావ్ 110 వ జయంతిని పురస్కరించుకొని అనకాపల్లి చోడవరం బస్సు స్టాప్ వద్ద ఎమ్మార్పియస్ నాయకుడు మంగరాజు ఏర్పాటు చేసిన
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, ఆయన ఆహ్వానం మేరకు దళిత అధ్యాపకులు పాల్గొనడం జరిగినది . తొలుత పట్టణ సి ఐ విద్యాసాగర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి
పూలమాల వేసి నివాళి అర్పించగా , అనంతరం ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు డా
తలతోటి పృథ్వీ రాజ్ , తుమ్మపూడి నిరంజన్ కుమార్ , డి విలియం జాన్ విక్టర్ , లెఫ్ .
ఎం . కొండలరావు జగ్జీవన్ రామ్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత
నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏ ఎం ఏ ఎల్ కళాశాల దళిత అధ్యాపకులు తమవంతు
ఆర్ధిక సహాయాన్ని కొంత అందించారు .
No comments:
Post a Comment