దళిత అధ్యాపకుల సమస్యల పరిష్కారార్థమే స్థాపించిన సంస్థ డాక్టా . అంటే దళిత ఎయిడెడ్ అధ్యాపకుల సంఘం. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాన్ని మా అభ్యర్థన మేరకు అనకాపల్లి లో ఏ ఏం ఏ ఎల్ అధ్యాపకులుగా నిర్వహించడానికి డాక్టా రాష్ట్ర కార్యవర్గం అవకాశం కల్పించారు. 26 జూన్ 2016న నిర్వహించిన ఈ కార్యక్రమానికి దళితుల ముద్దు బిడ్డ , ఆరోగ్యశాఖ మాజీ మంత్రి వర్యులు శ్రీ కొండ్రు మురళీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు . ఈ కార్యక్రమంలో శ్రీయుతులు డాక్టా నాయకులు డా . గోవిందు సురేంద్ర , కె . అమరేశ్వరరావు , డా . ఎ వెంకటేశ్వర రావు , డా . కె .సుధాకర్ , కె శ్రీనివాస రావు మొదలగున్నవారు పాల్గొన్నారు . అదే రీతిగా స్థానిక దళిత నాయకులు శ్రీయుతులు గ్యాస్ అప్పారావు, పావాడ కామరాజు , కంకణాల శ్రీను , పందిరి దయాళ్ రాజ్ మొదలగున్నవారు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొందరు మురళీ మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలను అధికమించవచ్చని , హక్కులను సాధించుకోవచ్చని తెలియజేసారు . అధ్యాపకుల సమస్యలపై చర్చించడానికి ఏ అధికారివద్దకైన రావడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు. అనంతరం డాక్టా కార్యవర్గం అనేక అంశాలపై చర్చించుకుంది . అనంతరం చక్కని విందును ఆరగించారు .
No comments:
Post a Comment